ఆస్తి గొడవలో ఆరుగురిని పొడిచి చంపిన యువకుడు…!

-

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది.. ఒక ఆస్తి వివాదంలో ఆరుగురు కుటుంబ సభ్యులను అజయ్ సింగ్ అనే యువకుడు పొడిచి చంపి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. లక్నో శివారుల్లో ఈ ఘటన జరిగింది. ఆస్తి విషయంలో గత కొంత కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిందితుడు తన తల్లి, తండ్రి, అన్నయ్య, భార్య మరియు ఇద్దరు పిల్లలను – ఒక కుమారుడు మరియు కుమార్తెను చంపాడని పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడు ఇద్దరు మైనర్ పిల్లలను కూడా చంపారని పోలీసులు తెలిపారు. బాధితులను అమర్ (60), రామ్‌సాకి (55), అరుణ్ (40), రామ్‌దులారి (35), సౌరభ్ (7), సరికా (2) గా గుర్తించారు. పోలీసు కమిషనర్ సుజీత్ పాండే మాట్లాడుతూ ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారని నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడని వివరించారు. ఈ దాడిలో అతనికి కూడా గాయాలు అయ్యాయి.

కుటుంబ౦ అంతా కూర్చుని మాట్లాడుకునే సమయంలో గొడవ జరిగింది అని ఆస్తి తనకు వాటా ఇప్పుడే ఇవ్వాలని అతను వాదించగా తల్లి కుదరదు అని చెప్పిందని దీనితో అతను ఆగ్రహానికి గురై బూతులు తిట్టగా అడ్డు వచ్చిన అన్న మీద ముందు దాడి చేసాడని ఆ తర్వాత మిగిలిన వారి మీద పదునైన ఆయుధం తో దాడి చేసి చంపాడని పోలీసులు ప్రాధమిక విచారణలో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news