48 గంటల ముందే చనిపోయిన మనోజ్ఞ, భర్తే చంపెసాడా…?

-

తల్లి కూతుళ్ళు మృతి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సాప్ట్ వేర్ ఉద్యోగిని మనోజ్ఞ ఆమె కూతురు తులసి అనుమానాస్పద మృతి పై అనుమానాలు బలపడుతున్నాయి. పోస్టు మార్టం రిపోర్ట్ లో 36 నుండి 48గంటల ముందు చనిపోయినట్లుగా నివేదిక ఇచ్చారు వైద్యులు. శనివారం ఉదయం అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారని భర్త కళ్యాణ్ వివరించారు.

ఆదివారం మద్యాహ్నం డెడ్ బాడీలకు పోస్టు మార్టం నిర్వహించారు. 36 నుండి 48 గంటల ముందు చనిపోతే ఆత్మహత్య ఎలా చేసుకుంటారని మనోజ్ఞ కుటుంభ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుండి భర్త కాల్ డేటా బయటకు తీస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మనోజ్ఞ కుటుంబ సభ్యులు. అంటున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news