గోదావ‌రి న‌దిలో దూకి న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో దారుణం చోటు చేసుకుంది. న‌వ వ‌ధువు.. గోదావ‌రి న‌దిలో దూకి ఆత్మ హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న పోల‌వ‌రం గ్రామంలో జ‌రిగింది. కాగ పోల‌వ‌రం గ్రామానికి చెందిన అనురాధ (19) ని కృష్ణా జిల్లాలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన శివ ప్ర‌సాద్ తో ఈ నెల 20న వివాహం జ‌రిపించారు. కాగ శనివారం ఉద‌యం అనురాధ‌ను అత్త వారి ఇంటికి తీసుకెళ్ల‌డానికి త‌ల్లి దండ్రులు సిద్ధం అవుతుండ‌గా.. అనురాధ గోదావ‌రి న‌దిలో దూకింది. స్థానికులు అనురాధ కుటుంబ స‌భ్యుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

అనురాధ కోసం న‌ది మొత్తం గాలించారు. శ‌నివారం సాయంత్రం అనురాధ మృత దేహం గోదావ‌రి నదిలో ల‌భ్యం అయింది. కాగ తల్లి ఫీర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. అనురాధ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణల‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు. కాగ అనురాధ తండ్రి చిన్న త‌నంలో మ‌ర‌ణించాడు. దీంతో తల్లి కుటుంబ పోషణ చేసింది. అలాగే అనురాధ కూడా దుస్తుల దుకాణాల్లో కూడా ప‌ని చేసింది. కాగ ఇటీవ‌ల పెద్దల స‌మ‌క్షంలో వివాహం జ‌రిగింది. కాగ ప్ర‌స్తుతం అనురాధ ఆత్మ‌హ‌త్య కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news