వాటర్‌ బాటిల్‌ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!

-

రైలులోని ప్యాంట్రీ సిబ్బంది ఓ ప్రయాణికుడి పట్ల అమానుషంగా వ్యవహరించారు. అతడిపై దాడికి పాల్పడటమే కాకుండా కదులుతున్న రైలునుంచి కిందకు తోసేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌ ప్రాంతంలో జరిగింది. రవి యాదవ్‌ (26) అనే వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. అయితే వాటర్‌ బాటిల్‌, గుట్కా విషయంలో రవి, రైల్వే పాంట్రీ సిబ్బంది మధ్య గొడవ తలెత్తింది.

కాగా వారు దిగాల్సిన లలిత్‌పుర్‌ స్టేషన్‌లో రవి యాదవ్‌ సోదరి దిగిపోగా, అతడిని మాత్రం సిబ్బంది దిగనివ్వలేదు. రైలు కదిలిన అనంతరం రవిపై దాడి చేశారు. ఆపై కదులుతున్న రైళ్లోనుంచి అతడిని కిందకు తోసేశారు. తీవ్ర గాయాలపాలైన రవిని కొందరు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు, ప్రయాణికులు, రైల్వే సిబ్బందిని ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news