Breaking : కంటైన‌ర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. డ్రైవ‌ర్ మృతి

-

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోని జ‌డ్చ‌ర్లలో దారుణం చోటు చేసుకుంది. ఆర్టీసీ బ‌స్సుకు ప్ర‌మాదం సంబ‌వించింది. కంటైన‌ర్ ను ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదం లో డ్రైవ‌ర్ అక్క‌డి కక్క‌డే మృతి చెందాడు. అలాగే బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న మ‌రో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్ర‌మాదం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని జ‌డ్చ‌ర్ల మండలం చిట్టిబోయిన‌ప‌ల్లి వ‌ద్ద చోటు చేసుకుంది. కాగ పొగ మంచు కార‌ణంగా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.

పొగ మంచు ఎక్కువ ఉండ‌టంతో ముందు వాహ‌నం క‌న‌బ‌డ‌లేద‌ని స‌మాచారం. దీంతో కంటైన‌ర్ ను వెన‌క నుంచి ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. స్థానికుల స‌మాచారం పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. కాగ ఏపీ ఆర్టీసీ కి చెందిన బ‌స్సుగా పోలీసులు గుర్తించారు. ఈ బ‌స్సు తిరుప‌తి డిపోకు చెందిన ఈ బ‌స్సు.. తిరుప‌తి నుంచి హైద‌రాబాద్ వెళ్తుండ‌గా.. ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కాగ ఈ ప్ర‌మ‌దం పొగ మంచు ఎక్కువ రావ‌డం వ‌ల్లే జ‌రిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news