ప్రేమన్మాది గురించి సంఘవి సోదరుడు రోహిత్ సంచలన వ్యాఖ్యలు

-

ఎల్బీనగర్ లో నిన్న దారుణ ఘటన జరిగిన విషయం తెలిసిందే.  ప్రేమోన్మాది దాడి ఘటనలో సంఘవి అనే యువతి తీవ్ర గాయాలతోనూ, ఆమె సోదరుడు పృథ్వీ ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సంఘవి, పృథ్వీల సోదరుడు రోహిత్ ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

గతంలో మాఅక్కను శివ కుమార్ వేధిస్తున్నాడని హెచ్చరించాను.ఇలాంటి ఘటన మా ఇంట్లో జరుగుతుందని అస్సలు ఊహించలేదు. 10వ తరగతి నుంచి మా అక్కను వేధిస్తున్నాడని మాకు తెలుసు. నిన్న బంధువులు, స్నేహితులు ఫోన్ చేయ్యడంతో విషయం తెలుసుకోని ఎల్ బి నగర్ కు వెళ్ళాను. గదిలో మొత్తం రక్తపు మరకలు ఉన్నాయి.శివకుమార్ వాళ్ళ అక్క కూడా మా అక్కని వేధించినట్లు మా దృష్టికి వచ్చింది. మా అక్కను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు వేధించారు. ప్రేమోన్మాది శివకుమార్ ను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.అతను బయటకు వస్తే మా అక్క సైతం చంపే అవకాశం ఉంది. మాకు శివ కుమార్ నుంచి ప్రాణహాని ఉంది. శివకుమార్ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది వాళ్ళ తండ్రిని హత్య చేశాడు. ప్రభుత్వం కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము అని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news