ఇబ్రాహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

-

ఇబ్రాహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి సంచలన తీర్పు ఇచ్చింది. 2022 మార్చి 1వ తేదీన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలనే రియల్టర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. ఇబ్రాహీంపట్నంలోని కర్ణగూడ వద్ద ఉన్న పరికరాల ల్యాండ్ వివాదమే వీరి హత్యకు కారణంగా దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపారు. మట్టారెడ్డి నవీన్ లతో పాటు మరో ముగ్గురు కలిసి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి లను చంపినట్టుగా గుర్తించారు. పక్కా ఆధారాలను కోర్టులో పోలీసులు సబ్ మిట్ చేశారు.

దీంతో మట్టారెడ్డి.. ఖాజా మొయినుద్దీన్, బిక్షపతిలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆరోజు జరిగిన సంఘటనను మృతుడు శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కృష్ణ, షరీఫ్ లు వివరించారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను చంపిన తరువాత మా ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేశారు. మేమే చంపామని పోలీసులు వివరించారు. మట్టారెడ్డి ఆ స్పాట్ లోనే ఉన్నాడ. ఎందుకు చంపావని నిలదీశాం.. కానీ తనకు ఏమి తెలియదు అని మట్టారెడ్డి చెప్పాడు. పోలీసులకు మట్టారెడ్డి చంపాడని చెప్పాం. మొత్తానికి దర్యాప్తులో పోలీసులు సాక్ష్యాధారాలతో సహా మట్టారెడ్డి మరో ఇద్దరిపై కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పోలీసులకు రుణపడి ఉన్నామని మృతుడు శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కృష్ణ, షరీఫ్ లు అన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఈ కేసు తీర్పుతో అందరికీ తెలిసిందని వారు తెలిపారు. నిందితులకు శిక్ష పడటం చాలా సంతోషంగా ఉందని మృతుడు శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కృష్ణ, షరీఫ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news