శోభనం గదిలో నవ వరుడు అనుమానాస్పద మృతి

-

పెళ్లంటే నూరేళ్లపంట. తన జీవిత భాగస్వామితో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి అయిన 12 గంటల లోపే ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం జరిగింది. పెళ్లి జరిగే 12 గంటలు గడవకముందే నవ వరుడి మరణం కలకలం రేపింది. పాకాల మండల కట్టికందపల్లెకు చెందిన తులసి ప్రసాద్ కు మదనపల్లె చంద్ర కాలనీకి చెందిన యువతితో సోమవారం ఉదయం బంధువుల మధ్య ఘనంగా వివాహం జరిగింది.

అనంతరం శోభనం తతంగం కోసం తులసి ప్రసాద్ అత్తగారి ఇంటికి వెళ్లారు. శోభనం ఏర్పాటు చేయగా, అర్ధరాత్రి సమయంలో తులసి ప్రసాద్ నిర్జీవంగా పడిపోయాడు. ఎంతకు లేవకపోవడంతో అత్తమామలకు, కుటుంబ సభ్యులకు పెళ్లి కుమార్తె సమాచారం ఇచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. తులసి ప్రసాద్ మరణం పై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news