బ్రేకింగ్: నలుగురు పిల్లలను గొడ్డలితో నరికి చంపేసాడు…!

-

మహారాష్ట్రలోని జల్గావ్‌ లో దారుణ ఘటన జరిగింది. 3-12 సంవత్సరాల మధ్య వయసున్న నలుగురు పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు గుర్తు తెలియని వ్యక్తి.. తల్లి తండ్రులు పని కోసం బయటకు వెళ్ళగా నలుగురు పిల్లలను దారుణంగా చంపేసాడు. జల్గావ్‌లోని బోర్ఖేడా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తల్లిదండ్రులు, మెహతాబ్ మరియు రుమాలి భీలాలా, మధ్యప్రదేశ్ నుండి వచ్చి నివాసం ఉంటున్నారు.

పొలాలలో పని చేయడానికి ఆ గ్రామంలోకి వచ్చారు. శుక్రవారం… వాళ్ళు పని చేస్తున్న పొలం యజమాని ముస్తఫా నలుగురు పిల్లలను రక్తపు మడుగులో ఉన్నట్టు గుర్తించాడు. వారు హత్యకు గురైనట్టుగా గుర్తించారు. ఆ తర్వాత వారిని చంపినా గొడ్డలిని గుర్తించారు. పిల్లలందరినీ ఒకే గొడ్డలితో హత్య చేసి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. పిల్లలను సైతా (12), రావల్ (11), అనిల్ (8), సుమన్ (3) గా గుర్తించారు.ప్రత్యేక ఐపిఎస్ అధికారి నేతృత్వంలో సిట్ వేసారు

Read more RELATED
Recommended to you

Latest news