పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్…!

-

మెట్రో రైల్ యాజమాన్యం పండుగల సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనాతో ఎఫెక్ట్ తో తగ్గిన ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు చార్జీల్లో రాయితీ ప్రకటించింది.రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఈ కింది రాయితీ వర్తిస్తాయని తెలిపింది.

మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ..స్మార్ట్ కార్డు ద్వారా 7 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం.. 14 ట్రిప్పుల చార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పించింది. 20 ట్రిప్పుల చార్జీతో … 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.40 ట్రిప్పుల చార్జీతో … 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం ఉంది. టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ ఆఫర్ అమలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news