బద్ధకంగా ఉన్నాడని.. భర్తను నరికి కూర వండిన భార్య

-

భర్త బద్దకంగా ఉన్నాడని ఓ భార్య అతన్ని చంపి కూర వండేసిన సంఘటన సెర్బియాలో చోటు చేసుకుంది. జ్రెంజనిక్‌ కు చెందిన సర్జాన్‌ పెరిక్‌ అతన్ని థెరెస్సా పెరిక్‌ అనే ఆమె పెళ్లి చేసుకుంది. అయితే.. థెరెస్సాకు అంతకంటే ముందుగా నాలుగు పెళ్లిల్లు అయ్యాయి. పెరిక్‌ ఆమెకు ఐదో భర్త కావడం గమనార్హం.

నలుగురు భర్తకు విడాకులిచ్చాక సర్జాన్‌ కు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. థెరిస్సాకు నలుగురు పిల్లలున్నారు. అయితే.. ఐదో భర్త అయిన సర్జాన్‌ తో మాత్రం ఇంత వరకూ పిల్లలు కలుగలేదు. తనతతో పెళ్లయ్యి.. రెండేళ్లు అవుతున్నా.. సర్జాన్‌ ఇంట్లోనే ఏ పనీ పాటా లేకుండా ఉండేవాడని థెరిస్సా పలుమార్లు గొడవకు దిగింది.

ఇరువురి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. భర్త బద్దకంతో ఉండటాన్ని చూసిన విసిగిపోయిన థెరిస్సా మే 10వ తేదీన రాత్రి సమయంలో భర్త సర్జాన్‌ పై దాడి చేసి హత్య చేసింది. సర్జాన్‌ ను థెరెస్సా చంపుతుండగా.. ఆమె కూతురు డి. ఎల్జే కళ్లారా చూసింది. భర్తను చంపిన తర్వాత సర్జాన్‌ మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని పెద్ద ఫ్యాన్‌ లో ఉంచి థెరిస్సా కూర వండింది. అయితే.. దీనిపై తెలుసుకున్న పోలీసులు.. ఆమెను అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news