వికారాబాద్ లో దారుణం… బాలికపై అత్యాచారం, హత్య

-

రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా… ఎన్నిచర్యలు తీసుకున్నా ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. 

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్యంపల్లిలో దారుణం జరిగింది. చిట్యంపల్లి శివారులో 15 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేసి హత్యచేసినట్లుగా తెలుస్తోంది. బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు బాలికను నాని అనే వ్యక్తి కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. బాలిక మృతికి కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు గురైన బాలిక పదో తరగతి చదువుతోంది. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిందని…ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంతో గ్రామ శివారులో బాలిక మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలాన్ని ఎస్పీ కోటి రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news