పెళ్లి చేసుకోవట్లేదని ప్రియుడి గొంతు కోసిన మహిళ.. సూట్​కేస్​లో తరలిస్తూ..

-

ఉత్తర్​ప్రదేశ్​ ఘజియాబాద్​లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది ఓ మహిళ. అనంతరం.. ఆ మృతదేహాన్ని పడేసేందుకు సూట్​కేస్​లో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని సంభల్​ ప్రాంతానికి చెందిన ఫిరోజ్​గా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితురాలు ప్రీతి శర్మ తన భర్త దీపక్​ను విడిచిపెట్టి, నాలుగేళ్లుగా ఫిరోజ్​ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఫిరోజ్​ను ఆమె పెళ్లిచేసుకోవాలని భావించగా.. అందుకు అతడు నిరాకరించాడు. తనకు దక్కని వాడు ఎవరికీ దక్కకూడదనే అక్కసుతో ఆమె అతణ్ని అంతమొందించాలని పథకం వేసింది.

పక్కా ప్లాన్ ప్రకారం రేజర్​తో యువకుడి గొంతు కోసి చంపింది. అనంతరం.. మృతదేహాన్ని పడేసేందుకు దిల్లీలోని సీలంపుర్​ ప్రాంతంలో పెద్ద సూట్​కేసు కొనుగోలు చేసి తీసుకెళ్లింది. అనుమానించిన పోలీసులు.. మహిళను అనుసరించారు. సూట్​కేసులో మృతదేహాన్ని చూసి విచారించగా అసలు విషయం తెలిసింది. ఫిరోజ్..​ దిల్లీలో హెయిర్​ డ్రెస్సర్​గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news