Darbhanga Blast Case : దర్భంగా పేలుడు కేసులో ట్విస్ట్ : పాకిస్తాన్‌ నుంచి నిధులు

-

దర్భంగా పేలుడు కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ…సంచలన విషయాలను వెలికితీస్తోంది. దర్భంగా పేలుడు కేసులో సూత్రధారి సలీమే అని తేల్చేసింది. యూపీ నుంచి ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చిన సలీమ్‌.. ఇమ్రాన్‌, నాసిర్‌లతో రోజుల తరబడి భేటీ అయ్యాడని గుర్తించింది ఎన్‌ఐఏ. ఐఈడీ బాంబుల తయారీలో కూడా ఇమ్రాన్‌, నాసిర్‌కు శిక్షణ ఇచ్చాడని..నడుస్తున్న ట్రైన్‌లో బాంబులు పేల్చాలని కుట్ర పన్నారని అధికారులు కూపీలాగారు. దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లోని రెండు బోగీలను పేల్చేయ్యాలని ప్లాన్‌ చేసింది ఈ గ్యాంగ్‌.

అంతేకాదు… పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబాతో హజీ సలీమ్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఎల్‌ఈటీ ఆపరేటర్‌ ఇక్బాల్‌ ఖన్నాతో లింక్‌ ఉందని… ఇక్బాల్‌ ఖన్నా, హజీ సలీమ్‌ లు పెద్ద ఎత్తున్న నిధుల సేకరించారని అధికారులు గుర్తించారు. పాకిస్తాన్‌ నుంచి నిధులు తెప్పించినట్టుగా గుర్తించిన ఎన్‌ఐఏ… కోడ్‌ భాషలో నాసిర్ సోదరులతో సలీమ్‌ మాట్లాడాడని తెలిపింది. అయితే… ఆ కోడ్‌ భాషను డీకోడ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నది ఎన్‌ఐఏ. కాగా.. ఈ దర్భంగా కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేసింది ఎన్‌ఐఏ.

Read more RELATED
Recommended to you

Latest news