బీజేపీ ఆదిలాబాద్‌ ఎంపీపై సీఈవోకు ఫిర్యాదు

-

బీజేపీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ కు ఊహించని పరిణామం ఎదురైంది. బీజేపీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌పై సీఈవోకు ఫిర్యాదు చేశారు దాసోజు శ్రవణ్. గోడం నగేశ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి వివరాలు నమోదు చేయలేదని, ఈ విషయంపై ఆర్వోకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని సీఈవో వికాస్ రాజ్ దృష్టికి తీసుకొచ్చారు.

Dasoju Shravan complained to the CEO about BJP’s Adilabad MP candidate Godom Nagesh

బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించి, రిటర్నింగ్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నదని దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. ఈ తరుణంలోనే.. బీజేపీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌పై సీఈవోకు ఫిర్యాదు చేశారు దాసోజు శ్రవణ్.

Read more RELATED
Recommended to you

Latest news