నా అంతిమ యాత్ర పిఠాపురంలోనే జరుగుతుంది : వంగ గీత

-

పిఠాపురం వైసీపీ  అభ్యర్థి వంగా గీత  ఆసక్తికర  కామెంట్స్ చేశారు. తాజాగా పిఠాపురంలో నిర్వహించిన రోడ్డు షోలో సీఎం జగన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  పవన్ కళ్యాణ్ పని చేయలేడు అనడం లేదు..పని చేసే అవకాశం లేదు అంటున్నాను. నేను పని చేసినందుకు నన్ను నిలదీయాలా?పవన్ కళ్యాణ్ చెప్పాలి. నాకు జ్వరం వస్తే నేను హైదరాబాద్ పారిపోలేదు. ఆడవాళ్ళు కాబట్టి నన్ను ప్రశ్నించాలా?నన్ను అవమానిస్తారా? అని ప్రశ్నించారు.

పిఠాపురం తన సొంత కుటుంబం అని చెబుతూ వంగ గీత ఎమోషనల్ అయ్యారు. నేను ఇక్కడ పుట్టలేదని కొందరూ అవమానిస్తున్నారు. నా పుట్టుకు పిఠాపురానికి దగ్గర చేయకపోతే నా అంతియ యాత్ర ఇక్కడే జరగాలి. నా ఆడపడుచులు, అన్నదమ్ములు నాకు పుసుపు కుంకుమ పెట్టి పంపించాలి. మిమ్మల్ని చెంగుచాచి అడుగుతున్నా.. నాకు అవకాశం ఇవ్వండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు వంగ గీత.

 

Read more RELATED
Recommended to you

Latest news