ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

-

ఐపీఎల్ 14 వ సీజన్ లో నేడు రసవత్తర పోరు చెన్నైలో చెపక్ వేదికగా జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు తలపడనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ హైదరాబాద్ ఎంచుకుంది. ఇక లెక్కల ప్రకారం చూస్తే రెండు జట్లు దాదాపు సమానంగా ఉన్నాయి. ఐపీఎల్ లీగ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడారు.

ఇందులో ఆర్‌సీబీ ఏడు, హైదరాబాద్ 10 మ్యాచ్‌లను గెలిచాయి. అయితే ఈ సీజన్‌ లో ఇరు జట్ల మధ్య జరిగే తొలి ఫైట్ ఇదే కానుంది. అయితే ఈ సీజన్‌ లో విడివిడిగా చూస్తె ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ విజయాన్ని రుచి చూసింది. అదే సమయంలో, సన్‌రైజర్స్ మొదటి మ్యాచ్ లో పరాజయం పాలయింది. ఇక ఈ మ్యాచ్ లో విజయం కోసం ఉవ్విళ్ళూరుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news