టై అయిన ఢిల్లీ వ‌ర్సెస్ పంజాబ్ మ్యాచ్.. సూప‌ర్ ఓవ‌ర్‌లో తేల‌నున్న ఫ‌లితం…

-

దుబాయ్‌లోని దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో ఢి్ల్లీ క్యాపిట‌ల్స్‌, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఐపీఎల్ 2వ మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జ‌ట్లూ ఒకే స్కోరు చేయ‌డంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ ఫ‌లితం కోసం సూప‌ర్ ఓవ‌ర్ ఆడ‌నున్నారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచి పంజాబ్ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఢిల్లీ 8 వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులు చేసింది. దీంతో ఇరు జ‌ట్ల స్కోర్లు స‌మం కాగా సూప‌ర్ ఓవ‌ర్‌ను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version