బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయండి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు

-

ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు.పేదలకు ఇండ్లు కట్టుకుంటే అధికారులు ఊరుకోరని, బీఆర్ఎస్ ఆఫీసు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ..దాదాపు 2 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి పార్టీ ఆఫీసు నిర్మించారని చెప్పారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చినట్టు మున్సిపల్ కమిషనర్ తెలుపగా.. దానిని వెంటనే కూల్చివేయాలని , మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేస్తున్నానని అన్నారు.

ఆగస్టు 15లోపు 32 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తున్నామని వెల్లడించారు. ఏడు లక్షల కోట్ల అప్పు ఉండి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడానికి ముందుకు వెళ్తున్నారని అన్నారు. పైసా పైస పోగు చూసి రైతులకు సహాయం చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news