మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్తగా యూ-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మొన్న రూ.500 కోట్లు చేతులు మారాయని, అందులో రూ.100 కోట్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పంపారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానని చెప్పడానికే ఆయన డబ్బులు తరలించారన్నారు మహేశ్వర్ రెడ్డి.

తాజాగా ఈ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించారు.ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఢిల్లీకి రూ.100కోట్లు పంపించానని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తాను దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లానని, త్వరలోనే మహేశ్వర్రెడ్డి ఆరోపణలకు తగిన జవాబు చెబుతానని ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news