దేవరగట్టు సమరం.. 27 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం !

-

ఎలా అయినా కర్రల సమరం నిర్వహించాలని ఆ గ్రామం వారు, కరోనా నేపధ్యంలో ఈసారి ఎలా అయినా ఆపాలని పోలీసులు ఎంతో ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు ఆ గ్రామస్తుల మాటే నెగ్గింది. నిన్న రాత్రి పది గంటల వరకు పోలీసుల నియంత్రణలో ఉన్న దేవరగట్టు కొంచెం సేపట్లోనే జనాలతో నిండిపోయింది. యధావిధిగా మళ్ళీ కర్రలతో కొట్టుకున్నారు.

అర్ధరాత్రి సమయానికి చుట్టుపక్కల ఉన్న నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సుళువాయి, విరుపాకురం, ఎల్లార్తి గ్రామాల ప్రజలు గట్టుకు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు. లక్ష మందికి పైగా జనం ఈ ఉత్సవానికి విచ్చేశారు. కర్రల సమరంలో 27 మందికి పైగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news