ఆస్ట్రేలియా టూర్ కి భారత జట్ల ఎంపిక.. వాళ్ళిద్దరూ దూరం !

-

ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే, టీ20, టెస్టు జట్లను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ ల కోసం ఐపీఎల్‌లో కండరాల గాయం వల్ల గత రెండు మ్యాచ్‌లకు దూరమైన రోహిత్‌ శర్మతో పాటు స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ లను సునీల్‌ జోషి నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పరిమిత ఓవర్ల సిరీస్‌ ల్లో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్థానంలో లోకేష్ రాహుల్‌ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

రోహిత్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకోగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున అదరగొడుతున్న లెగ్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి తొలి సారి జాతీయ జట్టులో స్థానం కల్పించింది. అయితే కొవిడ్‌-19 నేపథ్యంలో బయో బబుల్‌ ను దృష్టిలో పెట్టుకొని సెలెక్షన్‌ కమిటీ జంబో జట్లను ప్రకటించింది. ఐపీఎల్‌ అనంతరం సిడ్నీ వెళ్లనున్న భారత జట్టు అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్‌ లో ఉండి నవంబర్‌ 27న తొలి వన్డే ఆడనుందన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news