విడాకుల నిర్ణయాన్ని విరమించుకున్న ధనుష్ – ఐశ్వర్య .. కారణం..?

-

గత కొన్ని రోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో విడాకుల విషయం సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత కోలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రజినీకాంత్, ధనుష్ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా ధనుష్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ కూడా ఎంతో బాధపడ్డారు. వీరిని కలిపే ప్రయత్నం చేశారు.

ఇకపోతే రజినీకాంత్ కూడా తీవ్రంగా మానసికక్షోభను అనుభవించారు. నిజానికి వీరు భార్యాభర్తలుగా విడిపోయి.. స్నేహితులగా కలిసి ఉంటాం అంటూ అఫీషియల్ గానే ప్రకటించారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కోలీవుడ్ జంట విడాకులు రద్దు చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇటీవల కౌన్సిలింగ్ తీసుకున్న వీరిద్దరూ పిల్లల కోసం తమ విడాకులు నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథలుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త విని అటు కుటుంబ సభ్యులు ఇటు సినీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ జంట లాగే టాలీవుడ్ బెస్ట్ కపుల్ సమంత – నాగచైతన్య కూడా విడాకులను రద్దు చేసుకోవాలని తమ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఐశ్వర్య – ధనుష్ త్వరలోనే విడాకులు రద్దు చేసుకుంటున్నాము అని అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వనున్నారు. ఏదేమైనా ఈ జంట తిరిగి అర్థం చేసుకొని పిల్లల కోసం అయినా కలవడం అందరిని ఆనందానికి గురిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news