టీటీడీ ఇంచార్జ్‌ ఈవోగా భాధ్యతలు చేపట్టిన ధర్మారెడ్డి..!

-

తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ బదిలీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయనను టిటిడి దేవస్థాన ఈవో బాధ్యతల నుండి తప్పించి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే అనిల్ కుమార్ సింఘాల్ ఖాళీ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో స్థానాన్ని టిడిపి ఇన్చార్జ్ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మారెడ్డి ఈ బాధ్యతలను స్వీకరించారు.

ఇప్పటి వరకు కేవలం అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ఇప్పుడు పూర్తి బాధ్యతలను స్వీకరించి టిటిడి ఈవోగా కొనసాగనున్నారు. అయితే ఇది తాత్కాలిక బాధ్యతలు అప్పగించడం మాత్రమే. అయితే టిటిడి ఈవోగా నియమించడానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జవహర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం నియమించే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా కాలం నుండి ఆయన టీటీడీ చైర్మన్ గా నియమించాలని ఆడుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. సింఘాల్ ను తాజాగా వైద్య శాఖకు బదిలీ చేయడంతో ఆయన ప్లేస్ లోకి వైద్య శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్న జవహర్ రెడ్డి ని తిరుమల తిరుపతి దేవస్థానాన ఈవో బాధ్యతలు అప్పగించడానికి చూస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news