సాయి పల్లవి అంతటి బాధను భరించి ఆ సినిమాలో నటించిందా..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి నటనకు,అందానికి డాన్స్ కు ఫిదా అయిన ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. ఇక దీంతో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక అందుకోసమే ఈ ముద్దుగుమ్మ తన అభిమానుల కోసం సినిమాలో ఎలాంటి కష్టాన్నైనా భరిస్తూ నటిస్తూ ఉంటుంది. మొదటగా ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తన మొదటి సినిమాతోని మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.ఇక ఆ తర్వాత ఎంతోమంది హీరోలు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఈమధ్య బాగా తన హవాని మరింత పెంచుకుంటోంది. ఇక నాని, సాయి పల్లవి, కృతి శెట్టి కలిసి నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రంలో సాయి పల్లవి మెస్మరైజింగ్ డ్యాన్స్ తో నటనతో అదరగొట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో క్లాసికల్ డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది ఆ బాధను చాలా బిగువు పట్టుకొని భరిస్తూ అభిమానుల కోసం ఈమె చాలా కష్టపడినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలియజేసింది సాయి పల్లవి.How the devadasi system is depicted in Nani and Sai Pallavi's Shyam Singha Roy | The News Minuteఇక సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ చిత్రంలో క్లాసికల్ డాన్స్ షూటింగ్ చేస్తున్న సమయంలో పీరియడ్స్ టైం లో కూడా ఈమె డాన్స్ చేయడం తనకు చాలా కష్టంగా అనిపించింది అని అది తనను శారీరకంగా కూడా చాలా దెబ్బతీసిందని.. తను చేసిన ప్రతిపాట కూడా అలాంటి సమయంలోనే చేశానని సాయి పల్లవి తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ వార్త తెలుసుకున్న అభిమానులు మాత్రం ఒక్కసారిగా షాక్ గురయ్యారు తను చేసే వృత్తి పట్ల తనని అభిమానించే అభిమానుల కోసం సాయి పల్లవి కొన్న ఈ డెడికేషన్ తెలుసుకున్న పలువురు అభిమానులు నెట్టిజనులు సైతం ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news