లీకేజ్ రాయుళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు..!

-

కొన్ని సంవత్సరాల క్రితం వరకు సినిమా విడుదల అయిన తరువాత కొన్ని రోజులకు సినిమా పైరసి వచ్చేది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. కొన్ని సినిమాలు ఏకంగా విడుదలకు ముందే ఇంటర్నెట్ లోకి వాస్తు ఉంటే, మరికొన్ని సినిమాల పాటలు సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఇది కేవలం చిన్న సినిమాలకు మాత్రమే కాకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలకు కూడా ఈ సమస్య తప్పడం లేదు. ఇప్పటికే అనేక సినిమాలకు షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటోలు బయటకు వచ్చాయి.

కొన్ని రోజుల క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలోని ఒక పాట ను చిత్ర బృందం విడుదల చేయడం కంటే ముందే బయటకు వచ్చేసింది. ఇలా చిత్ర బృందం అఫీషియల్ గా విడుదల చేయకముందే లీకేజ్ రాయుళ్ల ద్వారా సినిమాకు సంబంధించిన కంటెంట్ బయటకు రావడం చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు వార్నింగ్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బహిరంగ ప్రదేశాల్లో జరుగుతుండటంతో దిల్ రాజు అలర్ట్ అయ్యారు. లీకుల బెడద ఉండకూడదు అని దిల్ రాజు వార్నింగ్ ఇస్తూ ఒక ప్రకటన జారీ చేశాడు. #RC15 #SVC50 సినిమా షూటింగ్ అవసరాలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో జరుగుతోందని, దీన్ని ఆసరాగా తీసుకొని చట్ట విరుద్ధంగా తీసిన షూటింగ్ లొకేషన్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని అభ్యర్థిస్తూ దిల్ రాజు పోస్ట్ పెట్టారు. లీకులు ఒక వేళ జరిగితే అనధికారిక కంటెంట్ పోస్ట్ చేసిన ఆ ఐడీలపై యాంటీ పైరసీ టీమ్ చర్య తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇలా దిల్ రాజు లీకేజ్ రాయుళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news