విడుదల కంటే ముందే ఖరీదైన గిఫ్ట్ అందుకున్న డైరెక్టర్..!!

-

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. ఇది వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.  ఈ సినిమా పై దేశంలో భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి. ఎందుకంటే ఈ కథ మన రామాయణంను స్ఫూర్తిగా తీసుకొని తీసిన సినిమా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో గ్రాఫిక్స్ బాగా లేవని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అదే సమయంలో మరి కొంత మంది  హిందూ దేవుళ్లను కించ పరిచేలా టీజర్ వుందని కామెంట్స్ చేసారు.

దీనితో ఆదిపురుష్ టీజర్‌కు వస్తోన్న నెగిటివ్ కామెంట్స్ పై దర్శకుడు ఓం రౌత్ ఈ  సినిమాపై తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు. కాని ఈ సినిమా కంటెంట్, క్వాలిటీ విషయంలో చాలా మందికి నమ్మకం లేకుండా పోయింది. ఈక్రమంలోనే విడుదల చేసిన త్రీడి టీజర్ కు  నెటిజన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్రీడీలో టీజర్ చూసిన ప్రేక్షకులు టీజర్ బాగానే ఉందని కామెంట్ చేసారు. దీనితో ఓం రౌత్ కు ప్రభాస్ కు సినిమా పై కొంచెం నమ్మకం వచ్చింది.

రీసెంట్ గా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ మంచి ఖరీదైన బహుమతి అందుకున్నారు. ఇది ఆదిపురుష్ నిర్మించిన ను టీ-సిరీస్  నిర్మాత  భూషణ్ కుమార్ ఈ బహుమతి ఇచ్చారు.సుమారు రూ. 4.02 కోట్ల విలువ చేసే ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కారును ఓం రౌత్ గిఫ్ట్ గా అందుకున్నాడు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా ఫలితం కంటే ముందే గిఫ్ట్ పొందాడంటే , మనోడికి సూపర్ లక్ వుందని కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news