ఇండస్ట్రీలో మరో విషాదం.. అనుమానాస్పద స్థితిలో నటి మృతి !

-

సినిమా ఇండస్ట్రీలో  మరో విషాదం నెలకొంది. తమిళ నటి చిత్ర మరణించి రెండు రోజులు కూడా గడవక ముందే ఈరోజు మరో నటి మృతి చెందింది. బాలీవుడ్ చిత్రం ‘ది డర్టీ పిక్చర్’ లో ఎమ్రాన్ హష్మి, విద్యాబాలన్‌లతో కలిసి నటించిన బెంగాలీ నటి ఆర్య బెనర్జీ శుక్రవారం ఆమె దక్షిణ కోల్‌కతా నివాసంలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. ఆమె మూడవ అంతస్తు అపార్ట్మెంట్ తలుపు తెరిచిన పోలీసులు, 33 ఏళ్ల నటి మృతదేహం రక్తపు మడుగులో ఆమె పడకగదిలో పడి ఉన్నట్లు కనుగొన్నారు.

నివేదికల ప్రకారం, ఆర్య కోల్‌కతా జోధ్‌పూర్ పార్క్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె కొంత ఆహారాన్ని వాంతి కూడా చేసినట్లు సంకేతాలు ఉన్నాయి. ఆమె ముఖం కింద, నేల మీద రక్తం కారింది.  నివేదికల ప్రకారం, శుక్రవారం ఉదయం డోర్బెల్ మరియు ఫోన్ కాల్స్కు ఆమె స్పందించకపోవడంతో ఆమె పనిమనిషి పొరుగువారికి సమాచారం ఇచ్చింది. పోలీసులకు పనమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం ప్రకరం ఆర్య ఒంటరిగా నివసించిందని తేలింది. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం పంపించామని, ఫోరెన్సిక్ బృందం ఆమె గది నుంచి నమూనాలను సేకరించిందని పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news