బన్నీ వాసు ఇంట తీవ్ర విషాదం…

-

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్న బన్నీ వాసు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు సురేష్ నిన్న రాత్రి అనారోగ్యంతో కన్నుమూసిన సమాచారం అందుతోంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బెంగళూర్ లో చికిత్స పొందుతున్న ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో నిన్న రాత్రి మృతి చెందారు. సురేష్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇక సురేష్ ఇంజనీరింగ్ చదివి ఆటోమొబైల్ రంగంలో రాణిస్తున్నారు.

ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు. ఇక బన్నీవాసు విషయానికి వస్తే తొలుత డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ప్రారంభించిన బన్నీవాసు అల్లు అరవింద్ అన్న బంధుత్వంతో ఇప్పుడు నిర్మాత స్థాయికి ఎదిగాడు. ఏకంగా అల్లుఅరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి దాన్ని పూర్తిగా బన్నివాసు అప్పగించే చేసాడు అంటే ఆయన పనితనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం బన్నీ వాసు అక్కినేని అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news