ఫలించిన జగన్ యత్నాలు..ఏపీ క్యాడర్ కు ఐఏఎస్ శ్రీ లక్ష్మి

-

అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. తన అక్రమాస్తుల కేసులో ఇబ్బందులు పడిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఏపీ క్యాడర్ కు తీసుకువచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా శ్రీలక్ష్మి జి.ఎ.డి లో రిపోర్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. కేడర్ మార్చుకునేందుకు క్యాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మరో పక్క ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కూడా త్వరలోనే ఏపీ కి వస్తారని సోషల్ మీడియాలో అలాగే రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకురావాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో గానీ కేంద్ర ప్రభుత్వం దానికి అప్పటి నుంచి సమ్మతి తెలపలేదు. తాజాగా ఆమె ఏపీ నెట్ వర్క్ వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ ప్రయత్నాలు ఫలించినట్టు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news