మోసపూరిత హామీలతో కాంగ్రెస్ కాలం గడుపుతోంది: డీకే అరుణ

-

కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో కాలం గడుపుతోందని బిజెపి జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు మెట్టపల్లి లో బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏళ్ల నుండి పరిష్కారం కాని సమస్యలను మోడీ చూపించారని ఆర్టికల్ 370 , ట్రిపుల్ తలాక్ వంటి వాటిని మోడీ పరిష్కరించాలని అన్నారు.

బిజెపి బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే అని దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలు నెరవేరిపోతాయని నమ్మపలుకుతూ ఆరు గ్యారెంటీలతో అబద్ధాలు ఆడుతున్నారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version