మ‌ర‌ణించిన వారు కాకి రూపంలో వ‌స్తారా.. నిజ‌మెంతా..!

-

భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి శని దేవుడి యొక్క వాహనంగా ఉంది. హిందూ సాంప్రదాయంలో ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడో రోజు నుండి పదో రోజు వరకు కాకులకు పిండం పెట్టడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనేది వారి నమ్మకం. అయితే  సాంప్రదాయం తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం. పురాణాలను పరిశీలిస్తే ఓ ర‌హ‌స్యం తెలుస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు. తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక, తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు. యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నారు.


యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందువల్లనే ఈ నాటికీ పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు. హిందూ ధర్మం ప్రకారం అన్ని జీవరాశులకు మనుషులు ఏదో రకంగా సహాయం చేయాలి. అందుకే హిందూ కుటుంబంలో చనిపోయినవారికి కర్మకాండలు చేస్తారు. కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు ` ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాంష ` అనే మంత్రాన్ని చదువుతారు.

గాలిలో విహరించే పక్షులు, నీటిలో నివసించే జలచరాలు రూపంలో ఉండే పిత్రు దేవతలకు ఆహారం అందాలని ఆ మంత్రానికి అర్థం. పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం. అయితే పూర్వం మనుషులు నివసించే ప్రాంతంలో కాకులే ఎక్కువగా జీవించేవి. అందుకే మన పూర్వీకులు పిండ ప్రధానం చేసిన తర్వాత కాకులకు ఆహారంగా పెట్టేవారు. అది ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news