విజయశాంతి – గోపీచంద్ ల మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?

-

అగ్ర కథానాయికగా ఎన్నో సినిమాలలో నటించి లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి. చిరంజీవి , బాలకృష్ణ లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించడమే కాకుండా హీరోలతో సమానంగా పారితోషకం తీసుకున్న ఏకైక హీరోయిన్ అని చెప్పవచ్చు. ఇక ఈమె నటించిన ఒసేయ్ రాములమ్మ, కర్తవ్యం లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఏకంగా ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇక ఈమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది అంటే అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల అయ్యేవి కావు. దర్శకులు , స్టార్ హీరోలు కూడా ఈమె కోసం తమ డేట్స్ అడ్జస్ట్ చేసుకునేవారు అంటే ఇక ఆమెకు ఎంత క్రేజ్ ఉండేదో మనం ప్రత్యేకంగా ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు.

ఇక గోపీచంద్ విషయానికి వస్తే మొదట 2001లో తొలివలపు అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత జయం, వర్షం, నిజం వంటి సినిమాలలో విలన్ గా నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఉన్నట్టుండి హీరోగా తన కెరియర్లో యూటర్న్ తీసుకుని కథల ఎంపిక విషయంలో బోల్తాపడ్డ ఈయన ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమా జూలై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇకపోతే గోపీచంద్ కి విజయశాంతికి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది . ఇక వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం.

విజయశాంతి ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగడానికి కారణం గోపీచంద్ తండ్రి ప్రముఖ డైరెక్టర్ టీ. కృష్ణ అని చెప్పవచ్చు. ఇక ఈయన ప్రోత్సాహంతోనే ఆమె ఎన్నో సినిమాలలో మంచి మంచి కథలను ఎంచుకోవడం జరిగింది. ఇక టి. కృష్ణ వల్లే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది విజయశాంతి. ఇక టి.కృష్ణ ఫ్యామిలీతో విజయశాంతికి మంచి స్నేహ బంధం ఉండేదట. గోపీచంద్ చిన్నగా ఉన్నప్పుడు ఆమె దగ్గరుండి పెంచింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక విజయశాంతికి, గోపీచంద్ కి మధ్య ఒక మంచి స్నేహబంధం ఉందని చెప్పవచ్చు. గోపీచంద్ తండ్రి కారణంగానే ఆమె సినిమాలలో ఈ స్థాయికి ఎదిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version