మొక్కల కోసం స్మార్ట్ కుండీలు.. ఫీచర్స్ ఏంటో తెలుసా?

-

ఇప్పుడు అంతా స్మార్ట్ యుగం నడుస్తుంది..స్మార్ట్ ఫోన్ల నుంచి పళ్ళు తోమే బ్రష్ వరకూ అన్నీ స్మార్ట్‌గా మారిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా వస్తువుల పనితీరు కూడా మారిపోతోంది. మనుషులకు సంబంధించిన అన్నీ స్మార్ట్ గా మారుతుంటే.. మొక్కలకు ఎందుకు మారకూడదు అనుకున్నారేమో కానీ లెట్‌పాట్‌ అనే ఓ సంస్థ కుండీలను సైతం స్మార్ట్‌గా మార్చేశాయి. ‘ఎల్‌పీహెచ్‌ మ్యాక్స్‌’ పేరుతో రూపొందించిన ఈ స్మార్ట్‌ పూల కుండీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇందులో ఉన్న ఫీచర్లు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఇంతకీ ఈ పూల కుండీలో ఉన్న ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చుద్దాము.. ఈ పూల కుండీని ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్యకాంతి ఉండదు కదా ఎలా అనుకుంటున్నారా.. సూర్యకాంతి అవసరమైన సమయంలో దీనిపై ఉన్న రూఫ్‌లో అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి. ఇదే సూర్య కాంతిలా ఉపయోగపడుతుంది. ఫుల్‌ ఆటోమేటిక్‌గా పనిచేసే ఈ కుండీలో ఒకేసారి ఏకంగా 21 మొక్కల ను పెంచుకునే అవకాశం ఉంటుంది.

ఈ కుండీలో మట్టి వేయాల్సిన అవసరం ఉండదు, కేవలం నీటితోనే మొక్కలు పెరుగుతాయి. అవసరమైనప్పుడల్లా దానంతటదే నీటిని తీసుకుంటుంది. ఇక ఈ కుండీని స్మార్ట్ ఫోన్ సాయం తో ఆపరేట్ చెయ్యొచ్చు.. మొక్కలు ఎలా ఉన్నాయి, నీరు ఎంత ఉంది లాంటి వివరాల ను ఫోన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. పూల మొక్కలు, ఆకుకూరలు లాంటి మొక్కలను పెంచుకోవచ్చు. ఈ కుండీకి ముందు ఒక ఎల్‌సీడీ ప్యానెల్‌ ఉంటుంది. దాని ద్వారా కుండీలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.. ఇన్ని ఫీచర్స్ ఉన్న దీని ధర కేవలం రూ.27 వేలుగా పేర్కొన్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version