ఎమోషన్ అవ్వకండి.. కవిత లాయర్ ను వారించిన జడ్జీ..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో తన అరెస్ట్ చట్టవిరుద్ధమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది.

ఈ సందర్భంగా కవిత తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఈ కేసులో ఒకసారి సాక్షిగా, మరొసారి నిందితురాలిగా పిలిచారని కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగుతోందని పేర్కొన్నారు. ఈడీ తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన కలిల్ సిబల్.. ప్రస్తుత పరిణామాలను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేస్తున్నాయన్నారు. దీంతో భావోద్వేగానికి గురికావొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా కపిల్
సిబల్ ని వారించారు.Ju

వాదనలు విన్న ధర్మాసనం.. చట్టం అందరికీ ఒకటే, రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఇక్కడ జరపలేమని పేర్కొంది. ధర్మాసనం ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని పిటిషన్ లో రాజ్యాంగ పరమైన విషయాలను లేవనెత్తారని వాటిపై మిగతా పిటిషన్లతో కలిసి విచారిస్తామని స్పష్టం చేసింది. విజయ్ మదన్ లాల్ కేసుతో కలిపి విచారణ చేపడతామని పేర్కొంది. ఈ కేసులో కవిత ట్రయల్ ఎదుర్కొవాల్సిందే అని తేల్చి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news