నిజంగా మీరు నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించకండి : పవన్ కళ్యాణ్

-

సీట్ల సర్దుబాటుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ‘నా వ్యూహాన్ని తప్పుబట్టకండి. ప్రజా క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది అని తెలిపారు.జెండా’ పేరుతో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ…. పది సంవత్సరాలుగా అవమానాలు ఎదుర్కొన్న నన్ను మనవాళ్లు ప్రశ్నిస్తున్నారు. నేనేం సంపాదించానని నన్ను ప్రశ్నిస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు . నిజంగా మీరు నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించకండి. నా వెంట నడవండి. నన్ను ప్రశ్నించడం కాదు.. నాతో కలిసి యుద్ధం చేయండి’ అని ఆయన అన్నారు.

2024లో టీడీపీ-జనసేన పొత్తు విజయానికి ఈ జెండాలు స్ఫూర్తి అని.. అందుకే ఈ సభకు జెండా అనే పేరు పెట్టినట్లు పవన్ స్పష్టం చేశారు. ‘పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు అని అన్నారు.గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది. మన పార్టీ జెండాలు పోరాటానికి స్ఫూర్తి అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news