DOSTH : విద్యార్థులకు శుభవార్త : దోస్త్ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ గ‌డువు పొడిగింపు

-

విద్యార్థులకు తెలంగాణ విద్యా శాఖ శుభవార్త చెప్పింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్) మొదటి విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడగించింది. మొదటి విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ను ఈ నెల 24 వరకు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి పేర్కొన్నారు. ఈ నెల 31 న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనున్నట్లు స్పష్టం చేశారు.

మొదటి విడతలో సీట్లు పొందిన వారు ఆగస్ట్ 5 లోపు ఆయా కళాశాలల్లో ఆన్లైన్ రిపోర్ట్ చేయాలని ఆయన వెల్లడించారు. ఆగస్ట్ 1 నుండి 9 వ తేదీ వరకు రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందన్నారు కన్వీనర్‌ లింబాద్రి. ఆగస్ట్ 2 నుండి 9 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్‌ కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రారంభం కానున్నాయని తెలిపారు.

ఆగస్ట్ 14 న సీట్ల రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలు కానుందన్నారు. ఇక ఈ రోజు వరకు లక్ష 40 వేల 581 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. అలాగే ఇప్పటి వరకు లక్షా 28 వేల 573 మంది ఫీజు చెల్లించారని.. వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న విద్యార్థులు సంఖ్య 88 వేల 123కు చేరిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news