సీఎం రేవంత్ రెడ్డి సభలో డ్రోన్ కలకలం

-

సీఎం రేవంత్ సభలో డ్రోన్ కలకలం రేపింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేటలో జరిగిన జన జాతర సభకి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వద్ద అనుమతి లేకుండా ఓ వ్యక్తి డ్రోన్ ఎగరవేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డ్రోన్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు రామాంతపూర్కు చెందిన గణేష్ గా గుర్తించారు. ఎవరి ఆదేశాలతో డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారు? అనుమతి ఉందా? అనే వివరాలను ఆరా తీస్తున్నారు.

కాగా , ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని, రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గడిచిన 10 సంవత్సరాలు గా బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు తెలంగాణకు సాధించిందేమిటని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news