నగరంలో డ్రగ్స్ కలకలం.. ముఠా గుట్టు రట్టు..!

-

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టైంది. తార్నాకలో ఇద్దరు నైజీరియన్లను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్ ‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి 104 గ్రాముల కొకైన్‌, 1.64 లక్షల నగదు, 4 సెల్‌ఫోన్లు, ఓ బైకును కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. గత కొద్దికాలంగా మాదకద్రవ్యాలు అమ్ముతున్న జైదీ పాస్కల్‌ అతని ప్రియురాలు మోనికలను అరెస్టు చేశామని అధికారులు పేర్కొన్నారు.

అయితే పరారీలో మరో ముగ్గురు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం మోనిక, ముంబయి నుంచి హైదరాబాద్‌ కు డ్రగ్స్‌ ను సరఫరా చేసినట్లు తెలుస్తోంది. జోడిపాస్కెల్‌, మోనిక తార్నాకలోని నాగార్జున కాలనీలో నివాసముంటున్నారు. తార్నాక కూడలి వద్ద ఇద్దరిని ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంటు అధికారులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news