దుబ్బాక ఎన్నికల కోసమే ఆ డబ్బు : సీపీ కీలక ప్రకటన

-

సిద్దిపేట జిల్లా కేంద్రం అయిన సిద్ధిపేటలో రఘునందన్ రావు బంధువు ఇంటిలో గుర్తించిన 18 లక్షల 67 వేల రూపాయల నుండి 5 లక్షల 87 వేల రూపాయలు గుర్తు తెలియని వారు దొంగిలించినట్లు సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ సోదాలుకి సంబంధించి పూర్తిగా వీడియోలు రికార్డు చేసినట్టు ఆయన తెలిపారు .

ఇందులో పాల్గొన్నవారు డబ్బులు దొంగలించిన వారిని గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. రఘునందన్ రావు తన బంధువు జితేందర్ డ్రైవర్ ద్వారా ఈ డబ్బులు పంపారని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల కోసమే డబ్బులు పంపారని తేలిందని ఆయన పేర్కొన్నారు. మా విచారణలో దుబ్బాక ఎన్నికల కోసమే ఈ డబ్బు అని తేలిందని సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news