శభాష్ ఏపీ పోలీస్..కెనాల్ లో దూకి కుటుంబాన్ని రక్షించారు…!

-

ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓ సిఐ మరియు ఎస్సై ప్రాణాలకు తెగించి 2 ప్రాణాలను కాపాడారు. ఓ మహిళ తన కొడుకు మరియు కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు పోలవరం కెనాల్లో దూకింది. అయితే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకొని జగ్గంపేట సురేష్ బాబు తో పాటు జగ్గంపేట ఎస్ ఐ ఆ కుటుంబాన్ని రక్షించేందుకు కెనాల్లో దూకేశారు. కాగా ముగ్గురిలో తల్లి మరియు కొడుకును పోలీసులు కాపాడగలిగారు.

చిన్నారి ఆచూకీ గల్లంతు కావడంతో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక వారిని కాపాడే క్రమంలో లో సీఐ సురేష్ బాబు కూడా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇక ప్రాణాలకు తెగించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన సీఐ మరియు ఎస్ఐ ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సీఐ, ఎస్సై పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పోలీసులు ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news