చైనా బెట్టింగ్ యాప్స్ మీద ఈడీ దూకుడు

-

చైనా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. చైనా బెట్టింగ్ యాప్స్ స్కామ్ లో నేడు ఈడీ కస్టడీకి నిందితులు రానున్నారు. ముగ్గురు నిందితులను 8 రోజుల పాటు విచారించనున్న ఈడీ వారి నుండి విషయాలని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, చైనా కు చెందిన లిన్ యాంగ్ హు లను కస్టడీకి ఈడీ కోర్ట్ అనుమతి ఇచ్చింది. చైనాకు చెందిన మింగ్ యాంగ్, జింగ్ యాంగ్ తో పాటు డిల్లీ కిచెందిన నీరజ్ కుమార్ కీలక సూత్రదారులని ఈడీ చెబుతోంది.

china apps ban
china apps ban

మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుల పై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చైనా ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా విస్తరించిందని గుర్తించారు. ఏడాదిలో ఇండియాలో రెండు వేల కోట్ల లావాదేవీలు సాగించినట్టు చెబుతున్నారు. 100 కోట్ల మేరకు చైనాకు తరలించినట్టు గుర్తించారు. ఢిల్లీ, ముంబయి, గురుగ్రాం, పూణేలో దేశవ్యాప్తంగా 12 చోట్ల ఈడీ సోదాలు చేసి నాలుగు HSBC బ్యాంకు ఖాతాల్లో 47 కోట్లు సీజ్ చేసింది. 17 హార్డీస్క్ లు, 5 లాబ్టాబ్స్, మొబైల్ ఫోన్స్ స్వాదీనం చేసుకున్నారు. చైనాకు చెందిన బీజింగ్ టీ కంపెనీ ఇండియా లో ఈ కామర్స్ పేరుతో వందలాది బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news