ఈపీఎఫ్‌వో శుభ‌వార్త‌.. ఈడీఎల్ఐ స్కీమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెంపు..

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో) త‌న చందాదారుల‌కు శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్‌కు చెందిన‌ ఈడీఎల్ఐ స్కీమ్‌లో భాగంగా అందిస్తున్న డెత్ ఇన్సూరెన్స్ క‌వ‌రేజీని పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇన్సూరెన్స్ కింద రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు క‌వ‌రేజీని అందించేవారు. దాన్ని రూ.2.50 ల‌క్ష‌ల నుంచి రూ.7 ల‌క్ష‌ల‌కు పెంచారు. ఈ మేర‌కు ఈపీఎఫ్‌వో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

edli scheme insurance claim increased by epfo

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మ‌స్‌లేనియ‌స్ ప్రొవిజ‌న్స్ యాక్ట్‌, 1952 ప్ర‌కారం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ)ని ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు అందిస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్ ప్రైవేటు సెక్టార్‌కు చెందిన వేత‌న జీవుల‌కు వ‌ర్తిస్తుంది.

ఈ స్కీమ్ కింద నెల‌కు రూ.15వేల వ‌ర‌కు బేసిక్ శాల‌రీని తీసుకునే వారు అర్హులు. వారు ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఇన్సూరెన్స్‌ను పొందుతారు. ఈ క్ర‌మంలోనే సంస్థ‌లు ఉద్యోగుల బేసిక్ శాల‌రీ నుంచి 0.5 శాతాన్ని లేదా గ‌రిష్టంగా నెల‌కు ఒక ఉద్యోగికి రూ.75 చొప్పున ప్రీమియం చెల్లించాలి. దీంతో ఆ ఉద్యోగుల‌కు ఈడీఎల్ఐ స్కీమ్ వ‌ర్తిస్తుంది. ఈ క్ర‌మంలో ఉద్యోగులు చ‌నిపోయిన‌ప్పుడు వారి నామినీలు లేదా కుటుంబ స‌భ్యుల‌కు ఇన్సూరెన్స్ మొత్తం ల‌భిస్తుంది. వారు చెల్లించిన ప్రీమియంను బ‌ట్టి రూ.2.50 ల‌క్ష‌ల నుంచి రూ.7 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news