ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ చేసి చంపేస్తారా.. బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ‌కృష్ణం రాజు అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ వేడిని రాజేసింది. అయితే ఆయ‌న‌పై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ చేశారంటూ పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది. ఒక ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ చేయ‌డ‌మేంట‌ని అంతా ప్ర‌శ్నిస్తున్నారు. ఇక దీనిపై తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న కామెంట్లు చేశాడు.

వైసీపీ ప్ర‌భుత్వం దుర్మార్గ పాల‌న సాగిస్తోంద‌ని, ఒక ఎంపీని ప‌ట్టుకుని ఎలా థ‌ర్డ్ డిగ్రీ చేస్తారంటూ మండి ప‌డ్డారు. ఆయ‌న‌కు ఇప్ప‌టికే గుండె ఆప‌రేష‌న్ అయింద‌ని, థ‌ర్డ్ డిగ్రీ చేస్తే చ‌నిపోయే ప్ర‌మాదం ఉందంటూ చెప్పుకొచ్చారు.

ఏపీలో అస‌లు ప్ర‌భుత్వం అనేది ఉందా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక ఎంపీని రౌడీని అరెస్టు చేసిన‌ట్టు చేస్తారా అంటూ పోలీసుల‌పై మండి ప‌డ్డారు. వైసీపీ పార్టీ నియంతృత్వ పాల‌న సాగిస్తోంద‌ని, దీనికి మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. మొన్న ఎంపీ ర‌ఘురామ అరెస్టు అయిన‌ప్పుడు కూడా తెలంగాణ నుంచి బండి సంజ‌య్ మాత్ర‌మే స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news