రేపే ఎన్నికలు..వాతావరణ శాఖ కీలక ప్రకటన

-

రేపు రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రాగల 4 రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను అధికారులు జారీ చేసింది. సోమవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌,వికారాబాద్‌, సంగారెడ్డి,రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.మంగళవారం భూపాలపల్లి, ములుగు,వరంగల్‌, హన్మకొండ,ఉమ్మది ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట,కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపే, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడుతాయని, బుధ, గురువారాల్లోనూ పలు జిల్లాల్లో వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news