డ్రగ్స్ కేసు కలకలం : టాలీవుడ్ స్టార్లకు ఈడీ నోటీసులు !

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది సినీ స్టార్స్ డ్రగ్స్ కేసు. ఈ సినీ స్టార్స్ డ్రగ్స్ కేసు లో రంగంలోకి దిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… పలువురు టాలీవుడ్ స్టార్లకు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ స్టార్స్ కు ఈడీ సమన్లు జారీ చేసింది.

ఈ టాలీవుడ్ స్టార్ల లిస్టు లో చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాస్ ఉన్నారు. మరోసారి ఈ డ్రగ్స్ కేసులో విచారణ చేసేందుకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది. ఈడీ జారీచేసిన నోటీసుల ప్రకారం… ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్లు విచారణకు హాజరు కానున్నారు. ఇక ఈ వ్యవహారంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి… డ్రగ్స్ కేసు తెరపైకి రావడం తో అందరిలోనూ టెన్షన్ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news