అతి విశ్వాసమా: ఎటువంటి మార్పుల్లేకుండా జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ … !

-

రేవు లండన్ వేదికగా యాషెస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆఖరిది మరియు ఐదవది జరగనుంది. ఇప్పటికే అయిదు టెస్ట్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా 2 – 1 తో ముందంజలో ఉంది. కాగా దురదృష్టవశాతూ తమ విజయానికి అనుకూలంగా ఉన్న నాలుగవ టెస్ట్ వర్షం కారణంగా డ్రా గా ముగియడంతో ఇంగ్లాండ్ కు ఇక యాషెస్ సిరీస్ ను గెలుచుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా ఆఖరి టెస్ట్ కోసం తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ యాజమాన్యం పట్ల అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఈ జట్టులో గత టెస్ట్ మ్యాచ్ ఆడిన జట్టునే ప్రకటించడం విశేషం.. అయితే సీనియర్ మోస్ట్ పేస్ బౌలర్ ఈ సిరీస్ ఆసాంతం ఏమంత గొప్పగా రాణించకున్నా అతనికి ఆ టెస్ట్ లో చోటు కల్పించడం పట్ల పెదవి విరుస్తున్నారు. ఎందుకు ఇంత అతి విశ్వాసం అన్నట్లుగా నెటిజన్లు ఇంగ్లాండ్ కోచ్ ను మరియు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా రేపు మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే ఈ సిరీస్ మాత్రమే డ్రా గా ముగిస్తుంది.

కానీ యాషెస్ టైటిల్ మాత్రం ఆస్ట్రేలియా దగ్గరే ఉంటుంది. మరి చూద్దాం కనీసం ఈ మ్యాచ్ లో అయినా ఆండర్సన్ చెలరేగి వికెట్లు తీసి విమర్శకుల నోళ్లను మూయిస్తాడా ?

Read more RELATED
Recommended to you

Latest news