ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్..!

-

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసింది అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ వచ్చాకే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి చరిత్ర చూసి ఓటు వేయండని అన్నారు. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ చరిత్ర కూడా పరిశీలన చేయండి అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

సుధీర్ కుమార్, బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి నన్ను గెలిపిస్తే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడతాను అని అన్నారు. మామునూర్ ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ పూర్తి చేస్తాం అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అనేక పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. తెలంగాణ దళం, బలం ఉంటేనే ప్రశ్నించగలుగుతాం అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ కు బుద్ధి చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news