ఎర్రబెల్లి సోదరుడి భద్రతను కొనసాగించాలి – హైకోర్ట్

-

బిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపిలోకి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు తొలగించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఉన్న 2 + 2 గన్మెన్లను కేటాయించాలని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భద్రతను కొనసాగించాలని తెలిపింది. అయితే తనకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భద్రత తొలగించారని హైకోర్టులో ఎర్రబెల్లి ప్రదీప్ పిటిషన్ దాఖలు చేశారు.

ఎందుకు తొలగించారు కూడా అతనికి తెలియదని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకి ప్రాణహాని ఉందని టూ ప్లస్ టు భద్రత కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news