ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలి : ఎమ్మెల్యే ఈటల

-

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు నెరవేర్చలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన హామీలను మర్చిపోయారని మండిపడ్డారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. అమవీరుల స్తూపం నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. చౌటుప్పల్‌లో ఐలమ్మ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులు అర్పించారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటున్న కేసీఆర్‌ వ్యవహారశైలి చూస్తుంటే.. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చిన సీఎం కేసీఆర్‌.. చెల్లని రూపాయిగా మిగిలిపోయారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version